మరో ఘోర విమాన ప్రమాదం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 29, 2018

మరో ఘోర విమాన ప్రమాదం

ఇండోనేషియాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జకర్తా విమాశ్రయం నుంచి 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన లయన్‌ ఎయిర్‌ విమానం కొద్దిసేపటికే సముద్రంలో కుప్పకూలింది. సోమవారం ఉదయం 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్‌ ఎయిర్‌ విమానం జకర్తా నుంచి పంగ్కల్‌ పినాంగ్‌కు బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు గుర్తించిన అధికారులు, జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు తెలిపారు. ఘటనపై తక్షణమే స్పందించిన అధికారులు తీరానికి సమీపంలో విమాన శకలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని సాధ్యమైనంతవరకు రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad