మెక్సికో దేశాన్ని మంగళవారం భూకంపం కుదిపేసింది. 150మందికి పైగా మరణించారు. వేలాది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రగా నమోదైంది. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్యూబ్లాకు తూర్పు వైపున భూకంప కేంద్రం నమోదైనట్లు మెక్సికో భూకంప శాస్త్ర అధ్యయన సంస్థ తెలిపింది. ప్యూబ్లా, మొర్లస్, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. ఇటీవలే భూకంపం, తుపాను వల్ల మెక్సీకో తీవ్రంగా నష్టపోయింది. 1985 సెప్టెంబర్ 19న కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. నాటి ప్రమాదంలో దాదాపు 10 వేల మంది వరకు మృతి చెందారు. 32 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళవారం రోజునే భారీ భూకంపం సంభవించింది.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment