చిన్నారి వైశాలిని కలిసిన మోదీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 26, 2016

చిన్నారి వైశాలిని కలిసిన మోదీ

గుండె జబ్బుతో బాధాపడుతున్నఆరేళ్ల చిన్నారి వైశాలిని రాసిన లేఖపై స్పందించిన ప్రధానిమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆమె కలుసుకున్నారు. పుణెకు చెందిన వైశాలి రెండో తరగతి చదువుతోంది. గుండెలో రంధ్రం సమస్యతో బాధపడుతున్న చిన్నారికి, పెయింటర్ గా పనిచేసే ఆమె తండ్రి భారీ ఖర్చుతో కూడిన శస్త్రచికిత్స చేయింలేకపోయారు. మందులు కొనడానికి కూడా కష్టాంగా ఉంది. తన గుండె జబ్బుకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవనీ, సహాయం చేయాలంటూ ఆమె  ఇటీవల నేరుగా ప్రధాన మంత్రికే లేఖ రాసింది. దీనిపై మోదీ వెనువెంటనే స్పందించారు. చిన్నారి చికిత్స చేయించాలంటూ అధికారులను పురమాయించారు. ఆ తర్వాత వైశాలికి ఉచితంగా గుండెకు శస్త్రచికిత్స చేశారు. శనివారం పూణె పర్యటనలో ప్రధాని మోదీ... వైశాలిని, ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నారు. వైశాలితో ఆప్యాయంగా ముచ్చటించారు. "చిన్నారికి తాము సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందంటూ" ఆ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత వైశాలి తన గుండెను తట్టే లేఖ రాసిందనీ. ఆది తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad