సత్తా చాటిన సానియో జోడి -డబ్లుటీఏ టైటిల్ విజయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 27, 2014

సత్తా చాటిన సానియో జోడి -డబ్లుటీఏ టైటిల్ విజయం

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన డబుల్స్‌ భాగస్వామి కారా బ్లాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని బహుమతిగా ఇచ్చింది. ఏడాదికాలంగా బ్లాక్‌తో కలిసి ఆడుతున్న సానియా తమ భాగస్వామ్యంతోపాటు ఈ సీజన్‌ను కూడా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ విజయంతో ముగించింది. 2015లో టెన్నిస్‌కు దూరంగా ఉంటానని ఇదివరకే ప్రకటించిన బ్లాక్‌కు ఈ సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌. ఇక సానియా కెరీర్‌లో ఇదే తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.సింగపూర్‌: ఆసియా గేమ్స్‌ మిక్స్‌డ్‌
ఏకపక్షంగా సాగిన ఈమ్యాచ్‌ను సానియా జోడీ గంటలోనే ముగించింది. దీంతో ఈ  ఈ మ్యాచ్‌లో సానియా జోడీకి ప్రత్యర్ధి ఏమాత్రం పోటీనివ్వలేక పోయింది. తొలిసెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన సానియా జోడీ 6-1తో ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. ఈ సెట్‌లో ప్రత్యర్థి ఒక గేమ్‌మాత్రమే నెగ్గింది. ఇక రెండో సెట్‌లో ఇండో-జింబాబ్వే జోడీ మరింత చెలరేగిపోయింది. ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ అయినా నెగ్గే అవసీజన్‌లో వీ-పెంగ్‌ ద్వయం చేతిలో మూడు ఓటములకు సానియా-కారా జోడీ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.కాశం ఇవ్వకుండా మూడు బ్రేక్‌ పాయింట్లతో 6-0తో ఆ సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
డబుల్స్‌ స్వర్ణ పతక విజేత సానియా మీర్జా ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించింది. సింగపూర్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీలో కారా బ్లాక్‌ (జింబాబ్వే)తో కలిసి బరిలోకి దిగిన సానియా టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ తుది పోరులో మూడో సీడ్‌ సానియా-కారా జోడీ 6-1, 6-0తో వరుస సెట్లలో డిఫెండింగ్‌ చాంపియన్‌, రెండోసీడ్‌ సు వీ (చైనీస్‌ తైపీ)- షువాయ్‌ పెంగ్‌ (చైనా) ద్వయంపై అలవోక విజయం సాధించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad