కాంగ్రెస్ కురువృద్ధుడు కాకా తనయులు వివేక్, వినోద్ లు కారు దిగి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. సీనియర్ నేత కె.కేశవరావు, మరో ఎంపీ మంద జగన్నాథంతో కలిసి గత ఏడాది జూన్ రెండున వివేక్, వినోద్ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యంపై, నాటి సీఎం కిరణ్పై వ్యతిరేకతల కారణంగా పార్టీ వీడారు. అంతేకాదు, 'తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం దళితుడే' అనే టీఆర్ఎస్ విధాన నిర్ణయం వారు టీఆర్ఎస్లో చేరడానికి పురికొల్పాయి. ఇప్పుడు పరిస్థితి వేరు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేసింది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను ఆ పార్టీలో విలీనం చేస్తానని, లేకపోతే పొత్తు ఉంటుందంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ అన్నీ తూచ్ అన్నారు. దళిత సీఎం విషయంలోనూ ఆయన వైఖరి చూస్తుంటే, మాటపై నిలబడతాడనే నమ్మకం పోయింది. దాంతో అందుకే పార్టీ మారాలని వీ బ్రదర్స్ నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు కాకా తనయులు వివేక్, వినోద్ లు కారు దిగి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. సీనియర్ నేత కె.కేశవరావు, మరో ఎంపీ మంద జగన్నాథంతో కలిసి గత ఏడాది జూన్ రెండున వివేక్, వినోద్ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యంపై, నాటి సీఎం కిరణ్పై వ్యతిరేకతల కారణంగా పార్టీ వీడారు. అంతేకాదు, 'తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం దళితుడే' అనే టీఆర్ఎస్ విధాన నిర్ణయం వారు టీఆర్ఎస్లో చేరడానికి పురికొల్పాయి. ఇప్పుడు పరిస్థితి వేరు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేసింది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను ఆ పార్టీలో విలీనం చేస్తానని, లేకపోతే పొత్తు ఉంటుందంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ అన్నీ తూచ్ అన్నారు. దళిత సీఎం విషయంలోనూ ఆయన వైఖరి చూస్తుంటే, మాటపై నిలబడతాడనే నమ్మకం పోయింది. దాంతో అందుకే పార్టీ మారాలని వీ బ్రదర్స్ నిర్ణయించుకున్నారు.
No comments:
Post a Comment