దత్తన్న రథంపై రచ్చ దేనికి? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, April 12, 2014

దత్తన్న రథంపై రచ్చ దేనికి?

bandaru-dattatreya-election-campaign-vehicle

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఓ ప్రచార రథాన్ని రూపొందించారు. అయితే ఏంటీ అనుకుంటున్నారా? ఆ రథంపై పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రబాబు, తన బొమ్మలు వేయించుకున్న దత్తన్న పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బొమ్మ ముద్రించకపోవడమే ఇప్పుడు వివాదానికి అసలు ఆజ్యం పోస్తోంది. బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంతో పార్టీలో ఏర్పడిన అభిప్రాయ భేదాలకు బలాన్నిస్తోంది. పార్టీ కార్యాలయం ఎదుట సీనియర్ నేత, మాజీ గవర్నర్ వి. రామారావు ప్రారంభించిన ఈ రథంపై టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ ఏర్పాటు చేసి, తన బొమ్మ పెట్టకపోవడంపై కిషన్ కాస్త గుస్సాగానే ఉన్నట్లు సమాచారం. మరో విషయేమంటే.. ఈ రథ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన వారిలో కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad