మలేషియా ఎయిర్ లైన్స్ గల్లంతై రెండు వారాలు దాటుతున్నా.. ఇప్పటికీ కచ్చితమైన ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో 26 దేశాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న చైనా విమాన ఆచూకీ కనిపెట్టామని చెప్పింది. విమానానికి సంబంధించిన శకలాలను పోలిన చిత్రాలను సముద్రాల్లో కనుగొన్నట్లు పేర్కొంది. తర్వాత అవి ఎమ్హెచ్-370 విమానానివి కావని తేలింది. ప్రస్తుతం ఈ ఎమ్హెచ్ - 370 విమానం భాగాలు ఆస్ట్రేలియాలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహా ఛాయాచిత్రాల ద్వారా గుర్తించామని ఆ దేశ ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కాకపోవడానికీ అంతే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం.
No comments:
Post a Comment