రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడనుందని ఏబీపీ న్యూస్, నీల్సన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ మధ్య సర్వేలు తేల్చే అంశాలు నూటికి నూరు శాతం కచ్చితంగా నిజాలు కానప్పటికీ, రాబోయే లోక్ సభ ఎన్నికలపై సమగ్ర అంచనాకు ఇది ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ సారి సర్వేలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీల సంఖ్య రెండంకెలకే పరిమితం కానుంది. కేవలం 73 సీట్లతో సరిపెట్టుకోనుందని ఈ సర్వే వివరించింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఆ సర్వే తేల్చి చెప్పింది. ఆ పార్టీకి 217 సీట్లు వస్తాయని.. మొత్తం ఎన్డీఏకు 236 ఎంపీ సీట్లు దక్కుతాయని తెలిపింది. జనవరిలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వే నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏకు పది సీట్లు పెరిగాయి. తొలిసారి లోక్ సభ బరిలో దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పది సీట్లు దక్కించుకోబోతోంది. కాంగ్రెస్ కు దక్కే కొద్దిపాటి సీట్లు కూడా దక్షిణ భారతంలో తప్ప ఉత్తరాదిన ఏమాత్రం అవకాశం లేదని సర్వే నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రధాని మంత్రి అభ్యర్థిగా మోడీకి 57 శాతం మంది మద్దతు పలకగా, కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీకి కేవలం 18 శాతం మంది మాత్రమే దన్నుగా ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో తృణమాల్ కాంగ్రెస్ కు 29, అన్నా డీఎంకేకు 19, బీజేడీకి 16 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ద్రవ్యోల్బణం అతి పెద్ద సమస్య అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అవినీతి రెండో అతిపెద్ద సమస్య అని 34 శాతం, నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఆ సర్వే తేల్చి చెప్పింది. ఆ పార్టీకి 217 సీట్లు వస్తాయని.. మొత్తం ఎన్డీఏకు 236 ఎంపీ సీట్లు దక్కుతాయని తెలిపింది. జనవరిలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వే నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏకు పది సీట్లు పెరిగాయి. తొలిసారి లోక్ సభ బరిలో దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పది సీట్లు దక్కించుకోబోతోంది. కాంగ్రెస్ కు దక్కే కొద్దిపాటి సీట్లు కూడా దక్షిణ భారతంలో తప్ప ఉత్తరాదిన ఏమాత్రం అవకాశం లేదని సర్వే నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రధాని మంత్రి అభ్యర్థిగా మోడీకి 57 శాతం మంది మద్దతు పలకగా, కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీకి కేవలం 18 శాతం మంది మాత్రమే దన్నుగా ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో తృణమాల్ కాంగ్రెస్ కు 29, అన్నా డీఎంకేకు 19, బీజేడీకి 16 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ద్రవ్యోల్బణం అతి పెద్ద సమస్య అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అవినీతి రెండో అతిపెద్ద సమస్య అని 34 శాతం, నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment