రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్కుమార్రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం బుధవారం సాయంత్రం కొండా దంపతులు, మరో నేత కేకే మహేందర్లను దిగ్విజయ్ నివాసానికి తీసుకెళ్లారు. వారికి దిగ్విజయ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిందని కాంగ్రెస్సేనని, పార్టీ తమకు పుట్టిల్లులాంటిదని సురేఖ అన్నారు. తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్లో చేరానని చెప్పారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రావడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్కుమార్రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం బుధవారం సాయంత్రం కొండా దంపతులు, మరో నేత కేకే మహేందర్లను దిగ్విజయ్ నివాసానికి తీసుకెళ్లారు. వారికి దిగ్విజయ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిందని కాంగ్రెస్సేనని, పార్టీ తమకు పుట్టిల్లులాంటిదని సురేఖ అన్నారు. తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్లో చేరానని చెప్పారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రావడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు.
No comments:
Post a Comment