పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణ నోట్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 01, 2013

పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణ నోట్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గబోమని ప్రకటించిన కేంద్రం ఇక క్యాబినెట్ నోట్ తయారు చేయడం ఆరంభమైంది.ముందుగా ముసాయిదా ను తయారు చేయడానికి హోం శాఖకు ఆదేశాలు అందాయని కధనాలు వస్తున్నాయి. అత్యంత రహస్యంగా ఈ నోట్ ను తయారు చేస్తారు.తెలంగాణపై సంప్రదింపులు పూర్తి అయ్యాయని, ఇతరత్రా సీమాంద్రలో ఆందోళనలతో సంబందం లేకుడానే తమ కసరత్తు జరుగుతుందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఎన్ని రోజులలో ఇది పూర్తి అయ్యేది స్పష్టంగా చేప్పలేమని ఆ వర్గాలు అంటున్నట్లు మీడియాలో కధనాలు వస్తున్నాయి.తెలంగాణ నోట్ తయారైతే, పార్లమెంటు సమావేశాల తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశంలో దీనిని సమర్పిస్తారు.

No comments:

Post a Comment

Post Bottom Ad