ఫిబ్రవరి 2002 సంవత్సరంలో జరిగిన మత ఘర్షణలు, గుజరాత్ అల్లర్లలో మోడీ ప్రభుత్వం మద్దతుందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మోడీకి అమెరికా వీసాను నిరాకరించింది. అయితే ప్రస్తుతం దేశంలో మోడీకి అనుకూలంగా రాజకీయ పవనాలు వీస్తున్నాయి. అన్ని కలిసి వస్తే మోడీని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టడానికి మార్గం సిద్దమవుతున్న తరుణంలో గుజరాత్ లో పర్య
టించిన అమెరికా బృందం ప్రశంసలు మరికొంత బలాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది.
అభివద్ధి బాటలో దూసుకుపోతున్న గుజరాత్ను సందర్శించేందుకు అహ్మదాబాద్కు వచ్చిన అమెరికా పార్లమెంటు సభ్యులు, వ్యాపారవేత్తలతో కూడిన 18 మంది సభ్యుల బందం మోడీని కలిసింది. మోడీతో సమావేశమైన అమెరికా బృందం తమ దేశానికి ఆహ్వానించింది. గుజరాత్ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడంలో మోడీ పోషిస్తున్న పాత్రను ప్రశంసించింది. మోడీతో భేటీ అనంతరం అమెరికా ప్రతినిధుల సభలోని ఇల్లినాయి రాష్ట్ర రిపబ్లికన్ సభ్యుడు ఆరన్ స్కాక్ మీడియాతో మాట్లాడుతూ మోడీని అమెరికాకు ఆహ్వానించినట్లు తెలిపారు.
- ఫిబ్రవరి 2002 సంవత్సరంలో జరిగిన మత ఘర్షణలు, మత కల్లోలాలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మృత్యువాత పడ్డారు.
- మత ఘర్షణలను నివారించడంలో మోడీ ప్రభుత్వం విఫలమవ్వడమే కాకుండా.. ఓ వర్గంపై దాడులకు మోడీ ప్రభుత్వం ప్రోత్సాహించిందని ఆరోపణలు వచ్చాయి.
- మత ఘర్షణల్లో మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ దారుణ హత్యకు గురయ్యాడు.
- జాఫ్రీ సతీమణి జకియా జాఫ్రీ ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించింది.
- చివరకు మోడీపై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో కేసు చెల్లుబాటు కాలేదు.
- అయితే గుజరాత్ లోని గోద్రా అల్లర్ల మరకలు మోడీని అంటిపెట్టుకునే ఉన్నాయి.
No comments:
Post a Comment