అధికారంలో ఉన్నప్పుడు తమకు మించి ఎవరూ లేరన్నట్టుగా వ్యవహారాలు నడిపించింది నారా ఫ్యామిలీ. ఒకవైపు వ్యాపారాలు చేసుకుంటూ.. ప్రభుత్వంలోనూ నారా ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. కనీసం ప్రజల నుంచి గెలవకపోయినా నారా లోకేష్ మంత్రి అయిపోయాడు! ప్రజలు ఎన్నుకోరని అని ముందే అర్థం చేసుకున్నారో కానీ.. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి మంత్రి పదవి తీసుకున్నారు లోకేష్. ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయారు లోకేష్.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా చేజారింది. ఇలాంటి నేపథ్యంలో తెలుగదేశం పార్టీ ఫస్ట్ ఫ్యామిలీకి మరో ఝలక్ తగిలింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన నారా ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
నారా ఫ్యామిలీలో ఆడవాళ్లకు ప్రభుత్వ భద్రతను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. నారా లోకేష్ భద్రతను కూడా తగ్గించి వేసింది. మొన్నటి వరకూ లోకేష్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేది. ఇక నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలకు కూడా ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లు ఉండేవి. అవన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకే అని స్పష్టం అవుతోంది.
నారా లోకేష్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన ఎమ్మెల్సీ, మాజీ సీఎం తనయుడు కాబట్టి.. గన్ మెన్లను మాత్రం ప్రొవైడ్ చేస్తోంది ప్రభుత్వం. ఇక మిగతా నారా కుటుంబీకులకు మాత్రం భద్రత పూర్తిగా రద్దు కావడం గమనార్హం.
ఈ అంశంలో రొటీన్ గానే తెలుగదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. కనీసం సమాచారం ఇవ్వలేదని టీడీపీ వాళ్లు అంటున్నారు.
No comments:
Post a Comment