కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డోన్ మండలం కొత్తపల్లె క్రాస్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. బాధితులు ఆదివారం సాయంత్రం అనంతపురంలో జరిగిన జనసేన కవాతు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వోల్వో బస్సు కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment