వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పలు పార్టీల్లో కీలక పదవులను అలంకరించిన ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Post Top Ad
Friday, November 23, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment