మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మంగళవారం భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తొలిసారి ఈ టోర్నీలో పాల్గొంటున్న లవ్లినా బొర్గహైన్ సెమీస్ చేరుకోగా, మనీషా మౌన్, కచరి భాగ్యబతి ఇంటిబాట పట్టారు. 48 కేజీల లైట్ వెయిట్ విభాగం క్వార్టర్ ఫైనల్ విభాగంలో బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ 5–0తో వు యు(చైనా)ను చిత్తు చేసింది. తద్వారా ఈ క్రీడల్లో వరుసగా ఏడో పతకం ఖాయం చేసుకుంది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇప్పటి వరకూ ఆరు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించిన మేరీ ప్రస్తుతం సెమీస్కు చేరడం ద్వారా కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment