నందమూరి సుహాసినిని చేదు అనుభవం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

నందమూరి సుహాసినిని చేదు అనుభవం

High-Tension-At-Kukatpally
కూకట్‌పల్లి నియోజకర్గం అల్లాపూర్‌ పరిధిలోని రామారావునగర్‌లో ప్రచారానికి వెళ్లిన ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి చేదు అనుభవం ఎదురైంది. సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. అధికార టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఉద్రిక్తతకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సుహాసిని ప్రచారం కోసం మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెద్దలు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సోదరి గెలుపుకోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం ప్రచారం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad