కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవాలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అత్యంత నిష్టగా ఉండే ఈ దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ బద్ధంగా సరైనదే అయినప్పటికీ మత విశ్వాసాలు, భక్తుల నమ్మకాల దృష్ట్యా దేవాలయంలోకి మహిళల ప్రవేశం సరికాదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం తీర్పును నిరసిస్తూ వేలాది మంది భక్తులు కొట్టాయంలో ర్యాలీ నిర్వహించారు. వీరిలో చాలా మంది మహిళలు పాల్గొనడం విశేషం.
No comments:
Post a Comment