మావోయిస్టుల పేరిట లభ్యమైన కరపత్రాలు, బ్యానర్లు విశాఖ మన్యంలో కలకలం రేపుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున గూడెం కొత్తవీధి మండలం ఆర్వీ నగర్ వద్ద మావోయిస్టులు హెచ్చరికల కరపత్రాలను వెదజల్లినట్లు సమాచారం. చట్టం ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోలు ఆ కరపత్రాల్లో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయజనతాపార్టీ నాయకులు మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టి గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. గిరిజనులను దోచుకుతింటున్న టీడీపీ, బీజేపీ నేతలను మన్యం నుంచి తరిమి కొట్టాలని కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా మన్యం ప్రాంతం నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Post Top Ad
Monday, October 29, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment