మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు ఈవారంలోనే సీట్ల పంపకాలు జరగనున్నాయి. వచ్చే ఆదివారంలోగా అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేయాలని తెలుగుదేశం, తెలంగాణ జనసమితి(తెజస), సీపీఐలు నిర్ణయించాయి. ఈ మూడు పార్టీల ముఖ్యనేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి అక్టోబర్ 23 రాత్రి సమావేశమై చర్చించారు. తొలి జాబితాలో అన్ని పార్టీల తరపున ప్రధాన నేతల టిక్కెట్లను ప్రకటించనున్నారు. బుధ, గురువారాల్లో సీట్ల పంపకాలపై ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దీనికి సంబంధించిన వర్తమానాన్ని భాగస్వామ్య పార్టీలకు చేరవేసినట్లుగా సమాచారం. దీనిపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయంపైనే మహాకూటమి భవిష్యత్ ఆధారపడి ఉందని ఇప్పటికే తెజస, సీపీఐలు సంకేతాలిచ్చాయి.
Post Top Ad
Wednesday, October 24, 2018
ఈ వారంలోనే.. మహాకూటమి జాబితా !
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment