దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్చరణ్ల కోసం ఓ మల్టీ స్టారర్ కథ సిద్ధం చేసిన రాజమౌళి మరో ఇంట్రస్టింగ్ పాయింట్ను తెరమీదకు తీసుకువచ్చారంట. ఇద్దరు కథానాయకుల పక్కన ముగ్గురు కథానాయికలను ఎంచుకున్నారట. అందులో ఓ కథానాయికగా విదేశీ భామ కూడా ఉందట. ఆముగ్గరు ఎవరో త్వరలోనే ప్రకటిస్తారని చిత్రవర్గాలు తెలిపాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 5న లాంఛనంగా మొదలవుతుంది. సరికొత్తగా కనిపించేందుకు నిపుణుడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ప్రత్యేక కసరత్తులు మొదలెట్టేశారు. చరణ్ పాత్ర, ఆయన గెటప్ కూడా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment