తన భర్త మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్య కేసు పెడితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 497 ప్రకారం అతనికి ఐదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేవలం పురుషుడికి మాత్రమే శిక్షించే వీలున్న సెక్షన్ 497ను సవాలు చేస్తూ కొందరు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వివాహేతర సంబంధంలో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. భర్త వివాహేతర సంబంధం శిక్షార్హమైన నేరం కాదని పేర్కొంది. కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చెప్పింది. వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా కేసు నమోదు చేయొచ్చు.
తన భర్త మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్య కేసు పెడితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 497 ప్రకారం అతనికి ఐదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేవలం పురుషుడికి మాత్రమే శిక్షించే వీలున్న సెక్షన్ 497ను సవాలు చేస్తూ కొందరు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వివాహేతర సంబంధంలో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. భర్త వివాహేతర సంబంధం శిక్షార్హమైన నేరం కాదని పేర్కొంది. కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చెప్పింది. వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా కేసు నమోదు చేయొచ్చు.
No comments:
Post a Comment