వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.. ఆయుష్మాన్ భారత్. నేషనల్ హెల్త్ ఏజెన్సీ ద్వారా కేంద్రం అమలు చేసే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు జార్ఖండ్ లో ప్రారంభించనున్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున దేశంలోని 10 కోట్ల మంది పేదలకు ఈ పథకం కింద లబ్ధి కలుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. వారి వయసుతో పనిలేకుండా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వివిధ వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు ఉండాలి. ఆధార్ లేకపోయినా ఫరవాలేదు. ఈ పథకంలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను రూపొందించింది. ఏమైనా సందేహాలుంటే ఆ పోర్టల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు లేదా 14555 నంబర్ కు ఫోన్ చేయొచ్చు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.. ఆయుష్మాన్ భారత్. నేషనల్ హెల్త్ ఏజెన్సీ ద్వారా కేంద్రం అమలు చేసే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు జార్ఖండ్ లో ప్రారంభించనున్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున దేశంలోని 10 కోట్ల మంది పేదలకు ఈ పథకం కింద లబ్ధి కలుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. వారి వయసుతో పనిలేకుండా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వివిధ వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు ఉండాలి. ఆధార్ లేకపోయినా ఫరవాలేదు. ఈ పథకంలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను రూపొందించింది. ఏమైనా సందేహాలుంటే ఆ పోర్టల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు లేదా 14555 నంబర్ కు ఫోన్ చేయొచ్చు.
No comments:
Post a Comment