ముస్లిం మహిళల ప్రయోజనార్థం నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘ట్రిపుల్ తలాక్’ను ఎలాగైనా అమలు చేయడానికి పట్టు పట్టి ఉన్న విషయం తెలిసిందే. గతంలో దీనికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. దీనిలో భాగంగానే ఈ రోజు(బుధవారం) కేంద్ర మంత్రి వర్గం సమావేశమై ‘ట్రిపుల్ తలాక్’ ఆర్డినెన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ప్రకారం తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. భార్య వాదనలు విన్న తర్వాత మాత్రమే బెయిల్పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు.
ముస్లిం మహిళల ప్రయోజనార్థం నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘ట్రిపుల్ తలాక్’ను ఎలాగైనా అమలు చేయడానికి పట్టు పట్టి ఉన్న విషయం తెలిసిందే. గతంలో దీనికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. దీనిలో భాగంగానే ఈ రోజు(బుధవారం) కేంద్ర మంత్రి వర్గం సమావేశమై ‘ట్రిపుల్ తలాక్’ ఆర్డినెన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ప్రకారం తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. భార్య వాదనలు విన్న తర్వాత మాత్రమే బెయిల్పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు.
No comments:
Post a Comment