విజయవాడ దుర్గ గుడిని వివాదాలు వదలడం లేదు. ఇప్పటికే అమ్మవారి నగలు మాయం ఘటన, పట్టు చీర మాయం, గుడిలో తాంత్రిక పూజల వ్యవహారాలు సద్దుమణగముందే మళ్లీ పురోహితుల వివాదం మొదలైంది. వివరాల్లోకెళ్తే.. అమ్మవారి గుడి ముందు కృష్ణా నది ఒడ్డున దుర్గా ఘాట్ వద్ద శనివారం పురోహితులు ఆందోనళకు దిగారు. పిండ ప్రదానాలు చేయొద్దని నీటిపారుదల శాఖ అధికారులు పురోహితులను అడ్డుకుని, వారు లోపలకి వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గేట్లకు తాళాలు వేశారు. దీంతో పురోహితులు రోడ్లపైనే కూర్చొని పిండ ప్రదానాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అర్చకులపైన కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. నదిలో పిండ ప్రదానాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Post Top Ad
Saturday, September 22, 2018
Home
Unlabelled
విజయవాడ దుర్గ గుడి వద్ద మరో వివాదం
విజయవాడ దుర్గ గుడి వద్ద మరో వివాదం
Share This
About Somaraju
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment