నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు బలైపోయిన ప్రణయ్ భార్య అమృత.. తన తండ్రి తన దగ్గరకు వస్తే తానే చంపేస్తానని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏ నేరం చేయని ప్రణయ్ ను చంపిన తన తండ్రికి అంతకంటే ఘోరమైన చావు రావాలని చెప్పింది. కుల రహిత సమాజం ఉన్నప్పుడే ఇలాంటి హత్యలు ఉండవని అభిప్రాయ పడింది. కులం మాటను కూడా లేకుండా చేసినప్పుడే ముందు తరాలకు ఈ మహమ్మారి అంటదని చెప్పింది. ప్రణయ్ ఆత్మ శాంతి చేకూరేలా బిడ్డను పెంచి పెద్ద చేస్తానని చెప్పింది.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment