నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్ బుక్ సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్లో గ్రీవెన్స్ అధికారిని నియమించింది. అంతేకాకుండా వాట్సాప్ వినియోగదారులు తమ చుట్టూ ఉన్న నకిలీ వార్తలతోపాటు, సలహాలు, ఫిర్యాదులు చేసే విధానాన్ని సైతం వివరించింది. ఈ విషయాన్ని వాట్సాప్ అధికారికంగా వెల్లడించనప్పటికీ వాట్సాప్ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఎఫ్ ఏ క్యూ(తరచూ అడిగే ప్రశ్నలు)లలో ఈ సమాచారాన్ని ఉంచారు. ఆగస్టు చివర్లోనే గ్రీవెన్స్ అధికారిని నియమించినట్లు సమాచారం. వాట్సాప్ యాప్ లోని సెట్టింగ్స్ లో ఉన్న ఆప్షన్ ను ఎంచుకుని నేరుగా గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్ లో నకిలీ మెసేజ్లను ట్రాక్ చేసే వ్యవస్థను నెలకొల్పాలని, తద్వారా తీవ్ర నేరాలకు అడ్డుకట్ట వేయడం కోసం మెసేజ్ల మూలాలను పసిగట్టేందుకు సాంకేతిక పరిష్కారం ఏర్పాటు చేయాలని వాట్సాప్పై భారత్ ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వాట్సాప్ ఇండియా హెడ్ క్రిస్ డేనియల్స్తో భేటీ సందర్భంగా కోరిన విషయం తెలిసిందే.
Post Top Ad
Sunday, September 23, 2018
భారత్లో గ్రీవెన్స్ అధికారిని నియమించిన వాట్సాప్!
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment