టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను వితిక ఖండించారు. తమపై వచ్చిన రూమర్లు అన్నీ ఫేక్ అని కొట్టిపాడేశారు. వరుణ్తో సంతోషంగా ఉన్నానని పుకార్లను నమ్మొద్దని వితిక ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కూడా వెల్లడించారు. విదేశాలనుంచి తిరిగి వచ్చిన తనకు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడంతో డాక్టర్ సలహా మేరకు మాత్రలు వేసుకున్నానని తెలిపారు. ఎంతకూ నిద్రపట్టకపోవడంతో నాలుగు వేసుకోవడం వల్ల డోస్ పెరిగిందని తెలిపారు.
‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంగా మారింది. గత ఏడాది ఆగస్టులో వరుణ్-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు.
‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంగా మారింది. గత ఏడాది ఆగస్టులో వరుణ్-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు.
Whatever the news is spreading around about us @iamvarunsandesh Everything is a just a rumor. We are doing great.— Vithika Sheru (@IamVithikaSheru) July 11, 2017
No comments:
Post a Comment