రైలును ఢీకొన్న లారీ - ఆరుగురు దుర్మరణం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, August 24, 2015

రైలును ఢీకొన్న లారీ - ఆరుగురు దుర్మరణం

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు
చంద్రబాబు దిగ్ర్భాంతిఅనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడారు. సీఎం ఆదేశంలో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయంనాందేడ్‌ ఎక్‌ ్సప్రెస్‌ ప్రమాదానికి గురికావడంతో బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో. ముంబయి- బెంగళూరు ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్‌- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.
 మృతుల వివరాలు: వెంకటేష్‌ నాయక్‌ (కర్ణాటక- దేవదుర్గ ఎమ్మెల్యే), బి.రాజు ( ఇండోసిల్‌ కంపెనీ మేనేజరు, బెంగళూరు), అహ్మద్‌ (రైల్వే ఉద్యోగి, ఏసీ మెకానిక్‌, గుంతకల్‌), పుల్లారావు (రాయచూర్‌) లారీ క్లీనర్‌ నాగరాజు (తాడిపత్రి).
బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో హెచ్‌1 బోగి ఏసీ టెక్నిషియన్‌ అహ్మద్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌లు ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad