భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ పై 4-2 తేడాతో విజయం సాధించి స్వర్ణపతకం గెలుచుకుంది. దీంతో 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత అసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, భారత్ ఖాతాలో 9వ స్వర్ణపతకాన్ని జత చేసింది. ఈ విజయంతో 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్ కి భారత హాకీ జట్టు అర్హత సాధించింది. హాకీ జట్టు విజయం పట్ల భారత క్రీడా ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment