కిచిడీ సినిమాల దర్శకుడు శ్రీను వైట్ల తన తర్వాతి సినిమా గురించిన వివరాలు ఆగడు విడుదలైన తర్వాత వెల్లడించారు. రామ్ చరణ్ తో తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ‘ఆగడు' సినిమా డివైడ్ టాక్ వచ్చిన తర్వాత శ్రీను వైట్ల మాట కూడా మారింది. తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ... మరో వారంలో నా తదుపరి చిత్ర వివరాల్ని వెల్లడిస్తాను. హీరో ఎవరో అప్పుడే చెప్తాను అని వెల్లడించారు. దీన్ని బట్టి రామ్ చరణ్ ప్రాజెక్టు అతని చేయి జారినట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఆగడు' సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ పెద్దల నుండి అభిప్రాయాలు వెలువడ్డాయి. గతంలో కోన వెంకట్, గోపీ మోహన్లతో కలిసి పని చేసి వరుస హిట్లు అందుకున్న శ్రీను వైట్ల వారి సహాయం లేకుండా సొంత కథతో ‘ఆగడు' చిత్రాన్ని తెరకెక్కించాడు. కోన, గోపీ లేని లోటు ‘ఆగడు' సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, వారు ఉంటే ‘ఆగడు' మూవీ ఫలితం వేరేలా ఉండేదని మరికొందరి అభిప్రాయం. ఈ పరిణామాల నేపథ్యంలో....రామ్ చరణ్ సినిమా విషయంలో సీన్ మారింది. కోన వెంకట్, గోపీ మోహన్లతో కలిసి పని చేయాలని శ్రీను వైట్లపై ‘మెగా' ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కోసం అయినా శ్రీను వైట్ల మళ్లీ ఆ ఇద్దరితో కలిసి పని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ శ్రీను వైట్ల మొండిగా వెళితే ‘మెగా' షాక్ తప్పదని ఇండస్ట్రీ టాక్.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment