హైదరాబాద్
: ఈ నెల 19 తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర సర్వే రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. సమగ్ర సర్వేపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తుల మతం, కులం, పాన్కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాలని అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఈ వివరాలు దుర్వినియోగమైతే పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కేంద్రం సేకరించే జనాభా లెక్కల్లో కూడా కులం, మతం ప్రస్తావన ఉండదని ఆయన గుర్తు చేశారు.
No comments:
Post a Comment