రేపు నరేంద్ర మోడీని కలవనున్న పవన్ కల్యాణ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 16, 2014

రేపు నరేంద్ర మోడీని కలవనున్న పవన్ కల్యాణ్!

'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ రేపు సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు. మార్చి 14 తేదిన 'జనసేన పార్టీ' ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన పవన్ కళ్యాణ్.. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కూడా మోడీతో పవన్ భేటి కావొచ్చనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ మోడీ ప్రచారం చేస్తుండటం, అదే నినాదాన్ని పవన్ ఎత్తుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. జనసేనకు ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇంకా రాకపోవడం, కామన్ సింబల్ సమస్య జనసేన పార్టీకి ఎన్నికల్లో పోటికి ఆటకం కలిగించే అవకాశాలున్నాయి.  దాంతో పవన్ బీజేపీ వైపు దృష్టిసారించారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మోడీ, పవన్ ల భేటి వార్త రాజకీయాల్లో కొంత ఆసక్తి రేకేత్తిస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad