పార్టీలు మారుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2014

పార్టీలు మారుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ లేదని తెలుసుకున్న సీమాంధ్ర నాయకులు ఏదో ఒక సాకుతో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలతో జట్టు కట్టేందుకు జోరుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కర్నూలుకు చెందిన తాజా మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలు ఇప్పటికే టీడీపీలో తమ బెర్తులు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రులు వారి అనుయాయులు సహా పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ మరింత సమయం కావాలని గంటా బృందం కోరడంతో ఈ జాప్యం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే... టీజీ, ఏరాసులు టీడీపీలో చేరేందుకు ఈనెల 27వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు చర్చ జరిగినా.. ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. తక్కిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి రెండు రోజుల్లో వారినే అనుసరిస్తారని తెలిసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad