బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. లాలూ సొంత పార్టీ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)ని నిలువునా చీల్చేశారు. దాంతో ఆర్జేడీకి ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది పార్టీకి గుడ్ బై చెప్పి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయిన 13 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు గవర్నర్ కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జావేద్ ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. తిరుబాటు ఎమ్మెల్యేల్లో ఐదుగురు మైనారిటీ వర్గానికి చెందినవారున్నారు.
Post Top Ad
Tuesday, February 25, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment