హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని, ఈ విషయంలో సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాల్సిందేనని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతల వాదనకు తలొగ్గి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాను తెలంగాణ అంతటా విస్త్రతంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు.
Post Top Ad
Wednesday, August 21, 2013
బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలి: దానం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment