రాయచోటిలో గెలుపెవరిది? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 16, 2019

రాయచోటిలో గెలుపెవరిది?

రాయచోటి (వైఎస్సార్‌ జిల్లా)
నియోజకవర్గంలో ఉన్న మండలాలు: సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు.

వైఎస్సార్‌ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఒకటి.. రాయచోటి. ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, కాంగ్రెస్‌ (ఐ) ఎనిమిదిసార్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండుసార్లు, టీడీపీ రెండుసార్లు, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ, కేఎంపీపీ ఒక్కోసారి నెగ్గాయి. ఒకసారి ఇండిపెండెంట్‌ కూడా గెలుపొందారు. రాయచోటి నియోజకవర్గం నుంచి అత్యధికంగా సుగవాసి పాలకొండ్రాయుడు నాలుగుసార్లు (1978, 83, 1999, 2004), గడికోట శ్రీకాంత్‌రెడ్డి మూడుసార్లు (2009, 12, 14) విజయం సాధించారు.

2009లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. టీడీపీ అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడుపై గెలిచారు. తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి 2012 ఉప ఎన్నికలోనూ ఘనవిజయం సాధించారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2014 ఎన్నికల్లోనూ మరోమారు గెలిచి హ్యాట్రిక్‌ సృష్టించారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన శ్రీకాంత్‌రెడ్డికి 96,891 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, టీడీపీకి చెందిన రమేశ్‌కుమార్‌ రెడ్డికి 62,109 ఓట్లు వచ్చాయి. దీంతో 34,782 ఓట్ల మెజారిటీతో శ్రీకాంత్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. రాయచోటి నియోజకవర్గం రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. రాజంపేట ఎంపీ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి రాయచోటి నియోజకవర్గంలో 50,036 ఓట్ల మెజారిటీ లభించింది. 
ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన రమేశ్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయనున్నారు. జనసేన పార్టీ తరఫున ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు.




No comments:

Post a Comment

Post Bottom Ad