రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజు ఎవరో.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 16, 2019

రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజు ఎవరో..

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: రాజంపేట, రైల్వే కోడూరు (ఎస్సీ), రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు.

వైఎస్సార్‌ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి.. రాజంపేట. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి పదిహేనుసార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీడీపీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్‌ (ఐ), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కోసారి గెలిచాయి. మాజీ కేంద్ర మంత్రులు అయ్యన్నగారి సాయిప్రతాప్‌ ఆరుసార్లు, పి.పార్థసారథి నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు గెలుపొందారు. సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1989, 91, 96, 98, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అదేవిధంగా పి.పార్థసారథి 1967, 71, 77, 80 ఎన్నికల్లో గెలిచారు. కాగా, 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పోటీ చేయగా, టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున దివంగత సీఎం ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి పోటీ చేశారు. వాస్తవానికి ఆమె విశాఖపట్నం సీటును ఆశించినప్పటికీ బీజేపీ అధిష్టానం రాజంపేట సీటును కేటాయించింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డి 1,74,762 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మిథున్‌రెడ్డికి 6,01,752 ఓట్లు రాగా పురందేశ్వరికి 4,26,990 ఓట్లు వచ్చాయి. 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల, విశాఖపట్నం నుంచి పోటీ చేసిన గెలిచిన పురందేశ్వరి మూడోసారి రాజంపేటలో పరాజయం పాలయ్యారు. ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి పోటీ చేయనున్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మాజీ ఎంపీ సాయిప్రతాప్‌ టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది.




No comments:

Post a Comment

Post Bottom Ad