ప్రముఖ సినీ నటి, ఒకప్పటి ముద్దుగుమ్మ కుష్భూ తాజాగా నెటిజన్ల బారిన పడ్డారు. పాకిస్థాన్ పై భారతీయ వాయుసేన జరిపిన దాడులను ఫేస్ బుక్ లో అభినందించిన ఆమె దాడుల క్రెడిట్ మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కే దక్కుతుందని కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ క్రెడిట్ ను కొట్టేయడానికి కొంతమంది కాసుకు కూచున్నారని పేరు ఎత్తకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
దీంతో ఒళ్లుమండిన నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపించారు. నువ్వు కూడా సినిమాల్లో నటించావని, సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో హీరోయిన్లకు వస్తుందా? లేదంటే దర్శకుడికా వస్తుందా? లేక అందరికీ వస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. ఇంకో నెటిజన్ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ హీరోయిన్లు కొట్టేస్తున్నారని నువ్వు కూడా అలా పైకొచ్చినదానివేనని దెప్పిపొడిచారు. మరికొంతమంది షట్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా కుష్భూపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కుష్భూ నరేంద్ర మోదీపైన, బీజేపీ ప్రభుత్వంపైన ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్ రమ్య దివ్యస్పందన లానే నిత్యం బీజేపీ నాయకులను దునుమాడుతుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులను కూడా రాజకీయం చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో ఒళ్లుమండిన నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపించారు. నువ్వు కూడా సినిమాల్లో నటించావని, సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో హీరోయిన్లకు వస్తుందా? లేదంటే దర్శకుడికా వస్తుందా? లేక అందరికీ వస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. ఇంకో నెటిజన్ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ హీరోయిన్లు కొట్టేస్తున్నారని నువ్వు కూడా అలా పైకొచ్చినదానివేనని దెప్పిపొడిచారు. మరికొంతమంది షట్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా కుష్భూపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కుష్భూ నరేంద్ర మోదీపైన, బీజేపీ ప్రభుత్వంపైన ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్ రమ్య దివ్యస్పందన లానే నిత్యం బీజేపీ నాయకులను దునుమాడుతుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులను కూడా రాజకీయం చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
No comments:
Post a Comment