తప్పులు సరిదిద్దుకోండి. డబుల్ రిజిస్ట్రేషన్ చేయొద్దు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 11, 2019

తప్పులు సరిదిద్దుకోండి. డబుల్ రిజిస్ట్రేషన్ చేయొద్దు!


ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ తదితర ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ దరఖాస్తులను ఈనెల 8వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తుల్లో పొరపాటున తప్పులు దొర్లితే గతంలో మాదిరి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోవాలని, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)  స్పష్టం చేసింది. వచ్చే నెల 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment

Post Bottom Ad