ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రనాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాన్ని నందమూరి సుహాసినికి ఇచ్చి ఆమెను కరివేపాకులా వాడుకుంటున్నారని ఆమె అన్నారు. సుహాసినిని బలిపశువుని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందన్నారు. చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రివాడని చిత్తూరు జిల్లా ప్రజలు అనుకుంటున్నారని రోజా అన్నారు. టీడీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రనాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాన్ని నందమూరి సుహాసినికి ఇచ్చి ఆమెను కరివేపాకులా వాడుకుంటున్నారని ఆమె అన్నారు. సుహాసినిని బలిపశువుని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందన్నారు. చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రివాడని చిత్తూరు జిల్లా ప్రజలు అనుకుంటున్నారని రోజా అన్నారు. టీడీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని ప్రశ్నించారు.
No comments:
Post a Comment