తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్ రచనారెడ్డి, మర్రి శశిధర్రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డిలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రచనారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ వెంట పడి పార్టీలో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తో మీ డీలింగ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 16 నుంచి 18 పేర్ల తో జాబితా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చుతూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారని ఆమె విమర్శించారు. నమ్ముకుని వచ్చినందుకు మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్ రచనారెడ్డి, మర్రి శశిధర్రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డిలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రచనారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ వెంట పడి పార్టీలో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తో మీ డీలింగ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 16 నుంచి 18 పేర్ల తో జాబితా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చుతూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారని ఆమె విమర్శించారు. నమ్ముకుని వచ్చినందుకు మోసం చేశారని ఆరోపించారు.
No comments:
Post a Comment