తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రూ. 500 కోట్లు ఇస్తానని ప్యాకేజీ మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకుని ప్రజా కూటమిగా ఏర్పడ్డారని కూడా గతంతో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మర్యాద ఇస్తోందనేది తెలంగాణ వాదుల ఆలోచన. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రకటనల్లోనూ ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తాజాగా బాబు నివాసంలో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క, కర్టాటక మంత్రి డీకే శివకుమార్, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్లు హాజరయ్యారు. రెండు మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో తర్వాత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రూ. 500 కోట్లు ఇస్తానని ప్యాకేజీ మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకుని ప్రజా కూటమిగా ఏర్పడ్డారని కూడా గతంతో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మర్యాద ఇస్తోందనేది తెలంగాణ వాదుల ఆలోచన. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రకటనల్లోనూ ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తాజాగా బాబు నివాసంలో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క, కర్టాటక మంత్రి డీకే శివకుమార్, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్లు హాజరయ్యారు. రెండు మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో తర్వాత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
No comments:
Post a Comment