లక్ష్మణ్ రికార్డు బద్ధలు కొట్టిన కోహ్లీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 08, 2018

లక్ష్మణ్ రికార్డు బద్ధలు కొట్టిన కోహ్లీ!


ఆసీస్‌ గడ్డపై వేగంగా వెయ్యి పరుగులు సాధించి రికార్డు సాధించాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. అడిలైడ్‌ వేదికపై ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో 19 ఇన్నింగ్స్‌లు ఆడి వెయ్యి పరుగులు సాధించిన వీవీఎస్ లక్ష్మణ్‌ పేరుతో ఇప్పటివరకు ఉన్న ఈ రికార్డును కోహ్లీ 18 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు సాధించి బద్ధలుకొట్టాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత స్థానాల్లో సచిన్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్‌లు ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad