మాజీ మంత్రి రావెల కిశోర్బాబు ఎమ్మెల్యే పదవి, టీడీసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. పవన్ కల్యాణ్ సమక్షంలో శనివారం ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకున్న రావెల తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చంద్రబాబు క్యాబినెట్లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో రావెల రాజీనామా టీడీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.
Post Top Ad
Saturday, December 01, 2018
టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే రాజీనామా
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment