దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. దీనిలో వైఎస్సార్ పాత్రలో లెజెండరీ నటుడు మమ్ముట్టీ నటిస్తున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు, సుహాసిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
తొలుత సినిమాను డిసెంబర్లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆలస్యమైంది. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు.
చాలా కాలం తరువాత మమ్ముట్టి తెలుగు సినిమాలో నటిస్తుండటం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కావడంతో సినిమాపై అంచనాలుపెరిగాయి. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది.
No comments:
Post a Comment