రేవంత్‌ రెడ్డిపై ఈసీ సీరియస్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 03, 2018

రేవంత్‌ రెడ్డిపై ఈసీ సీరియస్‌

EC-Serious-On-Revanth-Reddy
టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై ఈసీ  సీరియస్‌ అయింది. ఈ నెల 4వ తేదీన కొడంగల్‌ బంద్‌కు పిలువునివ్వడం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. టీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ రేవంత్‌పై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad