ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరోసారి ఉతికి ఆరేశారు. ఆయనంత డర్టీఎస్ట్ పాలిటీషియన్ లేరని అన్నారు. ఆయన్ను అబద్ధాల కోరు, దుర్మార్గుడు అని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పారు. ఆయనసలు లీడరే కాదంటూ ఓ మేనేజర్ మాత్రమే అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని.. అలా అంటే జైల్లో పెడతా అని బెదిరించిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. నాలుగేళ్లు మోడీ సంక నాకి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అక్కడి ప్రజలు ఆయన్ను దారుణంగా ఓడిస్తారని కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.
హరికృష్ణ చావునూ సొమ్ము చేసుకునేందుకే ఆయన కూతురితో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. హరికృష్ణ శవంపై బాబు పేలాలు ఏరుకునే రకం అంటూ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు కేవలం వాడుకుని వదిలేసే రకం అని అన్నారు. సుహాసినికి ఇప్పుడైనా ఏమైనా ఇస్తరా అంటూ ప్రశ్నించారు.
No comments:
Post a Comment