విమానంలో తాగి గొడవ చేసినందుకు ఓ మహిళకు ఆర్నెల్ల జైలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 24, 2018

విమానంలో తాగి గొడవ చేసినందుకు ఓ మహిళకు ఆర్నెల్ల జైలు!


స్పెయిన్‌లోని టెనెరిఫే నుంచి బ్రిటన్‌కి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న కిరణ్‌ జాదవ్‌(41) అనే మహిళ దాదాపు ఏడాది క్రితం తప్పతాగి రచ్చ రచ్చ చేసినందుకు లండన్‌ కోర్టు ఆమెకు ఆరు నెలల శిక్ష విధించింది. బోర్డింగ్కు ముందే దాదాపు ఆరేడు బీర్లు తాగి, విమానంలో మరో 6 గ్లాసుల వైన్‌ పుచ్చుకుంది. అంతటితో సరిపెట్టుకోక మరింత మద్యం ఇవ్వాలని అడిగితే సిబ్బంది ఒప్పుకోకపోవడంతో కింద కూర్చుని నవ్వుతూ, ఏడుస్తూ ఆగమాగం చేసింది. దీంతో సిబ్బంది చేసిన ఫిర్యాదు సంబంధించిన కేసు విచారణ శుక్రవారం (నిన్న) జరగడంతో ఆమెకు శిక్ష పడింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad