కాంగ్రెస్ మూడో జాబితా! పొన్నాల సేఫ్! మర్రికి షాక్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 17, 2018

కాంగ్రెస్ మూడో జాబితా! పొన్నాల సేఫ్! మర్రికి షాక్!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూటమిలో భాగమైన కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాలో 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జనగామ స్థానాన్ని పొన్నాల లక్ష్మయ్యకు కేటాయించింది. అయితే జనగామతోపాటు మొదట్నుంచీ ఉత్కంఠ రేపుతున్న సనత్‌ నగర్‌ స్థానానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డికి కేటాయించలేదు. కూటమి పార్టీ అయిన టీడీపీ ఈ స్థానాన్ని కూన వెంకటేశ్‌ గౌడ్‌కు కేటాయించింది. దీంతో మర్రికి గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad