అల్లుడికి టికెట్ ఇప్పించుకోలేకపోయిన హోంమంత్రి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 18, 2018

అల్లుడికి టికెట్ ఇప్పించుకోలేకపోయిన హోంమంత్రి!


తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడికి ముషీరాబాద్ టికెట్‌ ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. ఆ టికెట్ను టీఆర్‌ఎస్‌ నేత ముఠా గోపాల్‌కు కేటాయించారు. ముషీరాబాద్‌ స్థానాన్ని తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని మంత్రి నాయిని మొదటి నుంచి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. బర్కత్ పురాలో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టీఆర్ఎస్ బీఫామ్ ను ముఠా గోపాల్ తీసుకోనుండటం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad